ipad/iphonetopBanner

కథలు

వరహాలమూట

రచయిత: చందమామ | 30th Mar, 2009


 

 

 

బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలించే కాలంలో, బోధిసత్వుడు ఒక భూస్వామికి కుమారుడుగా జన్మించాడు. అతడు పెరిగి, పెద్దవాడవుతున్న కాలంలో ఆ కుటుంబం మరింత సంపన్నమయింది. అతడికి ఒక తమ్ముడు కూడా వున్నాడు.

 

కొంత కాలానికి భూస్వామి కాలధర్మం చెందాడు. కుటుంబానికి సంబంధించిన ఒక గ్రామంలో తమకు రావలసిన వసూళ్ళ కోసం అన్నదమ్ములిద్దరూ ఒకనాడు బయలుదేరి వెళ్ళారు. అక్కడ రైతుల నుంచి తమకు రావలసిన ధాన్యం వగైరా వసూళ్ళ ద్వారా వెయ్యి వరహాల నగదు లభ్యమయింది. ఆ డబ్బు తీసుకుని అన్నదమ్ములిద్దరూ కాశీనగరానికి బయలుదేరారు. దారిలో వారొక నది దాటవలసి వున్నది.

 

అవతలి తీరానికి తీసుకువెళ్ళే పడవవాడు రావడానికి ఇంకా వ్యవధి వుండడం చేత, వాళ్ళు ఒక చెట్టు కింద కూర్చుని వెంట తెచ్చుకున్న ఫలహారం మూట విప్పి తిని, ఇన్ని మంచినీళ్ళు తాగారు. బోధిసత్వుడు అలవాటు చొప్పున తన భాగంలో కొంత ఫలహారం మిగిల్చి, దానిని నదిలోకి విసిరాడు. బోధిసత్వుడు విసిరిన ఫలహారాన్ని నదిలో వుండే ఒక జలభూతం అందుకున్నది. ఆ ఫలహారాన్ని తినగానే దానికొక దివ్యమైన శక్తి కలిగింది.

 

దాని ద్వారా, ఆ జలభూతం తనకు ఫలహారం వేసిన వారెవరైందీ సులభంగా గ్రహించింది. బోధిసత్వుడు ఆకలి తీరడంతో నది ఒడ్డున ఇసుక మీద పైబట్ట పరుచుకుని పడుకు న్నాడు. అతడి తమ్ముడిది దొంగబుద్ధి. అన్నకు భాగం లేకుండా వెయ్యి వరహాల సొమ్ము తనదిగా చేసుకోవాలని అతడికి బుద్ధిపుట్టింది. ఆ వెంటనే అతడు వరహాలున్న మూట వంటిదే, అక్కడ దొరికిన రాళ్ళతో మరొక మూట తయారు చేశాడు. ఆ రెండు మూటలూ అన్నకు కనబడకుండా తన దుస్తుల్లో భద్రంగా దాచాడు.


సంబంధిత కథలు

BannerBanner