ipad/iphonetopBanner

కథలు

మృత్యువు కోరలమధ్య నుంచి...

రచయిత: చందమామ | 17th Jul, 2008


ఒకనాడు ఔరంగజేబు, మహారాజా జస్వంత్‌ సింగ్‌తో కలిసి విశాలమైన రాజోద్యానంలో పచార్లు చేస్తూ, ‘‘ఇంత పెద్ద భయంకరమైన పులిని తమరెప్పుడైనా చూశారా?'' అంటూ ఒకవైపు బోనులో అసహనంగా తిరుగుతున్న పెద్దపులిని చూపాడు. ‘‘మా వీరభూమిలో పసిపిల్లలు సైతం ఇలాంటి పులులతో ఆటలాడుకుంటారు, ప్రభూ!'' అంటూ రాజాజస్వంత్‌సింగ్‌, దూరంగా నిలబడ్డ తన కుమారుడు పృథ్వీసింగ్‌ను చేయి ఊపి దగ్గరికి పిలిచి, పులితో పోరాడమని పురమాయించాడు.
 
పదహారేళ్ళ యువప్రాయంలో ఉన్న పృథ్వీసింగ్‌ అమితోత్సాహంతో పులి బోనులోకి వెళ్ళి పులితో కలియబడ్డాడు. కొంతసేపు దానితో పెనుగులాడి భీకరంగా పోరాడి మొలలోని బాకు తీసి దానిగుండెల్లోకి పొడిచాడు. పులి చివరి సారిగా గాండ్రించి ప్రాణాలు విడిచింది. తన కళ్ళను తనే నమ్మలేక గుడ్లప్పగించి చూసిన ఔరంగజేబు లోలోపల భయభ్రాంతుడయ్యూడు.
 
కొడుకే ఇంతటి సాహసవీరుడైతే, తండ్రి ఎలాంటివాడై ఉంటాడు? అన్న ఆలోచన అతడి మనసును కలచివేసింది. జస్వంత్‌ సింగ్‌, మార్వార్‌ (ప్రస్తుత జోధ్‌పూర్‌) రాజు. రాజస్థాన్‌లోని థార్‌ ఎడారిని ఆనుకుని వున్న ‘మార్వార్‌' అంటే ‘మరణ భూమి' అని అర్థం. మానవ నివాసానికి అనువుగాని వాతావరణం. విపరీతమైన నీటి ఎద్దడి.
 
ఇసుక నేల స్వరూపాన్నే మార్చివేసే ఇసుక తుపానులు. కరువు కాటకాలు. అయినప్పటికీ మాతృభూమి మీది మమకారం కొద్దీ, భూమి మీది అధికారం కోసం ఎన్నో యుద్ధాలు చేశారు అక్కడి వీరపాలకులు.
 
మార్వార్‌ పాలకుడు జస్వంత్‌సింగ్‌ అసమాన పరాక్రమశాలి అయినప్పటికీ, స్వార్థ ప్రయోజనాల కోసం ఎలాంటి నియమాలు పాటించకుండా మిత్రులను సైతం హతమార్చగలడన్న పేరు తెచ్చుకున్నాడు. అది ఔరంగజేబుకు మరింత కంటక ప్రాయంగా తయూరయింది. ఆ రాజపుత్ర రాజు అంతం చూడడానికి మొగలు చక్రవర్తి ఎన్నో విధాలుగా ప్రయత్నించాడు.

సంబంధిత కథలు

BannerBanner