పట్టువదలని విక్రమార్కుడు చెట్టువద్దకు తిరిగివెళ్ళి, చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని, ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, ‘‘రాజా, అలౌకికశక్తులూ, ప్రాణులకు హాని కలిగిస్తూ జీవించడమే నైజంగాగల విషసర్పాల్లాంటి జీవులూ విచ్చలవిడిగా సంచరించే, ఈ భయంకర శ్మశానంలో, రాత్రివేళ నిర్భయంగా కార్యసాధనకు పూనుకున్న నిన్ను, ధీరాతి ధీరుడవని ప్రశంసించక తప్పదు.
నీ ధైర్యసాహసాలు అద్భుతం. ఆశించిన లక్ష్యాన్ని సాధించేందుకు నీలాగే కఠిన శ్రమల కోర్చిన శశికాంతుడనే గ్రామీణ యువకుడి కథ చెబు తాను, శ్రమ తెలియకుండా, విను,'' అంటూ ఇలా చెప్పసాగాడు: పూర్వం కనకవరం అనే గ్రామంలో శశికాంతుడనే యువకుడుండేవాడు. |
|
|